లక్షపసుపు నోము కథ
శ్లో: లక్ష పసుపు నోము పట్టవే తల్లి!
లక్షణముగ సౌభాగ్యమందవే తల్లి!
అక్షయ సౌభాగ్యమందవేతల్లి!
లక్షలవేలేండ్లుగా రాణించవేతల్లి!
అని అనుకొని అక్షతలు వేసుకొని ఉద్యాపనము చేసుకోవలెను.
ఉద్యాపన:
నడుము విరగకుండ నున్న లక్షపసుపు కొమ్ములను ఏరుకొని వాటిని ఇంటిదగ్గర పంచిపెట్టవలెను.దోసెడుకు తక్కువ కాకుండా పంచిపెట్టవలెను. వాటితోబాటు తోచినంత కుంకుమ కూడా ఇవ్వవలెను. ఈ కుంకుమను ముందుగా లక్ష్మికో, గౌరికో పూజ చేసి తరువాత పంచిపెట్టవలెను.