Thursday 24 March 2016

స్త్రీలవ్రతకథలు - కుంకుమగౌరి నోము కథ

                              
                                కుంకుమగౌరి నోము కథ

ఒక బ్రాహ్మణునకు లేక లేక ఒక కూతురు కలిగెను. అంతనామె జాతకము చూడగా అందులో బాలవితంతువు అగునని ఉన్నది. అందుచే అతడు ఆమెకు వివాహము చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించెను. అంతట దయామయి అగు పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేమికావలెను?  అని అడుగగా అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండునట్లు  చేయమని ప్రార్థించెను. అప్పుడాలోక జనని" ఓయీ బ్రాహ్మణోత్తమా!  నీ కుమార్తె పూర్వ జన్మమున  కుంకుమగౌరి నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాలవైధవ్యము ప్రాప్తించుచున్నది , ఇప్పుడు ఆమెచేత ఆ నోము నోయించినచో ఆ కష్టము సంభవించదని " చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి ఆమెచే నోము నోయించి తరవాత ఆమెకు వివాహము చేసెను. ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతియై సుఖముగా ఉండెను.

ఉద్యాపన:  
పదమూడు భరిణెలనిండా కుంకుమ పోసి , నల్లపూసలు , లక్కజోళ్ళు , దక్షిణ తాంబూలములు పెట్టి పదముగ్గురు పుణ్యకాంతలకు వాయనము ఇవ్వవలెను.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.