Thursday 24 March 2016

శ్రీజయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 3


1  ప్రశ్న:  ఇంట్లో భారతం చదవకూడదు. చదివితే కలహాలు వస్తాయి. ఒకవేళ చదివినా మొదటి అధ్యాయం , చివరి అధ్యాయం మార్చి చదవవలెను , అంటున్నారు ఇది నమ్మవచ్చునా?
జవాబు:  ఇంట్లో భారతం మొదటి నుండి చివరి వరకు చదవవచ్చును.తప్పులేదు . భయపడవలసిన పనిలేదు.
 
2   ప్రశ్న:  స్త్రీలు శ్రీరుద్రం , శ్రీసూక్తం పఠించవచ్చునా?
జవాబు:   పఠించకూడదు.

3   ప్రశ్న:  మంగళవారం , శుక్రవారం  రాహుకాలం సమయంలో దేవాలయంలో నిమ్మపండు డిప్పలో దీపం వెలిగిస్తారు కదా!  అదే విధంగా స్వంత ఇంట్లో కూడా పెట్టవచ్చునా?
జవాబు:  ఇంట్లో నిమ్మపండు డిప్పలో దీపం వెలిగించకూడదు.


 4  ప్రశ్న:   బస్సు లేదా రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు కాలికి చెప్పులు వేసుకుని నడుస్తున్నప్పుడు లలిత , గణేష్ , విష్ణు వంటి  ఏదో ఒక సహస్రనామమో , ఇతర శ్లోకాలో చెప్పవచ్చునా?
జవాబు:  భజన , నామజపం మొదలైనవి చేయవచ్చును. మిగిలినవి నియమ , నిష్ఠలతో చేయవలసి ఉంటుంది.


 5  ప్రశ్న:  భోజనం చేసేముందు దేవుడిని ప్రార్థిస్తూ ఏశ్లోకం పఠించవలెను?
జవాబు:   " అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే
                      జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ "

 

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.