ధూమవ్యాకులదృష్టి రిన్దుకిరణైరాహ్లాదితాక్షీ పునః
పశ్యన్తీ వరముత్సుకా నతముఖీ భూయోప్రియా బ్రహ్మణః
సేర్ష్యా పాదనఖేన్దుదర్పణగతే గఙ్గాం దధానే శివే
స్పర్శాదుత్పులకా కరగ్రహవిధౌ గౌరీ శివా యాస్తు వః
పార్వతీ పరమేశ్వరుల వివాహమందు వివాహాగ్నియొక్క పొగ వలన అమ్మవారి కళ్ళు వ్యాకులత చెందగా శివుని శిరసునందున్న బాలచంద్రుడు తన కిరణములతో అమ్మవారి కళ్ళకు ఆహ్లాదము కలిగించెనట. అమ్మవారు మరల శివుని చూచుటకు ప్రయత్నింపగా ఆ ప్రయత్నమును బ్రహ్మ గమనించెనని ఎరిగి సిగ్గుమొగ్గయై తలవంచుకొని కూర్చొనెనట. చంద్రునివలె ప్రకాశించునదీ అద్దమువలెనున్నదీ అగు తన కాలిగోటియందు ప్రతిఫలించిన శివుని చూచుతూ, గంగనూ చూచి కించిత్తు ఈర్ష్యనందెనట. ఇంతలో పాణీగ్రహణమునందలి శివుని స్పర్శచేత పులకింతనొందెనట. అట్టి గౌరీదేవి మీకు మంగళము కలిగించుగాక.
No comments:
Post a Comment