రామాయణప్రభ : రామాయణమాహాత్మ్యము, కార్యసిద్ధి
శ్రీ శ్రీనివాసాచార్యులుగారు రాముడిని పూర్తిగా నమ్ముకున్నవారు. ద్వారకాతిరుమల దేవస్థానములో పనిచేస్తున్నారు, వీరు సుమారు 250సార్లు పూర్తిగా రామాయణం పారాయణ చేసినవారు. సుందరకాండను సుమారు 2700సార్లు పారాయణచేసినవారు. రామాయణమునకు గోవిందరాజీయముతోసహా వివిధభాష్యాలను ఆపోసన పట్టారు. ఏ ఘట్టమునైనా అంతరార్థములతో సహా పామరులకు సైతం సులువుగా అర్థమయ్యేటట్లు వివరిస్తారు, కానీ ప్రచారమునకు బహుదూరంగా ఉంటూ సాధారణజీవనం గడుపుతారు.
మా అదృష్టం చేత, వారు కొన్ని రామాయణ విశేషణములను వివరించి, ఆ వివరణను వీడియో తీయుటకు అనుమతించారు.
ఈ వీడియోలో, రామాయణం లోని శ్లోకాల, సర్గల పారాయణయొక్క ఫలితములను వివరించారు.