Saturday 11 June 2016

శ్రీ జయేంద్రవాణి - ప్రశ్నోత్తరములు 7

1 పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు సాయంత్రం సంధ్యావందనం చేయుటకు ముందు స్నానం చేయటం అవసరమా?
జ:  స్నానం చేయనవసరము లేదు. శుభ్రమైన వేరే బట్టలు కట్టుకుని సంధ్యావందనం చేయవచ్చును.

2  పరిషేచనం చేసిన తరువాత మధ్యలో లేవవచ్చునా? అందుకు ఏదైనా పరిహారం ఉన్నదా?
జ:  అలా లేవకూడదు. పరిహారం ఉండదు. ఆవిధంగా మధ్యలో లేస్తే ఆ ఆకు వదిలివేసి వేరే ఆకులో భోజనము చేయవలెను.

3 సంధ్యావందనమే కాకుండా మధ్యాహ్నికము కూడా చెయ్యవలెనా?
జ:  అవశ్యం చేయవలెను.

4 నిర్ణీత కాలములో సంధ్యావందనం చేయువారు ప్రాయశ్చిత్త అర్ఘ్యము ఇవ్వవలెనా?
జ: నియమంగా సంధ్యావందనం చేయువారు ప్రాయశ్చిత్త అర్ఘ్యము ఈయనవసరము లేదు. ఆచమనము, ప్రాణాయామము చేసి మొదట ప్రణవ వ్యాహృతి , తరువాత గాయత్రి , ఆతరువాత ప్రణవ వ్యాహృతి జపించవలెను.

5 సాయంత్రం అర్ఘ్యప్రదానం భూమి మీద చేయవలెనా? జలములో చేయవలెనా?
జ:  రెండూ చేయవచ్చును. నేలమీద కూర్చుంటే నేలమీద , నీటిలో నిలబడి ఉంటే నీటిలోనూ అర్ఘ్యప్రదానం చేయవలెను.

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది

ఈ బ్లాగు https://shankaravani.org/ కు ఇప్పుడు మార్చబడినది. సజ్జనులందరూ మా క్రొత్త వెబ్సైట్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.